విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్ధాలు

612చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ప్లాస్టిక్ భూతం భయాందోళన కలిగిస్తోంది. మండల కేంద్రంలోని పలు ఖాళీ ప్రదేశాలు జనావాసాల మధ్యన విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి ప్లాస్టిక్ వ్యర్ధాలు అలానే ఉండి పోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడమే కాకుండా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్