మసీదులలో రంజాన్ సామూహిక ప్రార్థనలు

75చూసినవారు
మసీదులలో రంజాన్ సామూహిక ప్రార్థనలు
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని మసీదులు ప్రత్యేక ప్రార్థనలతో కళకళలాడాయి. సామూహికంగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరినొకరు పరస్పరం అలయ్ బలయ్ తీసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల్లో నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్