శరీరంలో కాల్షియం తక్కువై కాళ్లు కోల్పోయిన వ్యక్తికి సోనూసూద్ చారిటీ సభ్యులు అండగా నిలిచి ఆదుకున్నారు. సూర్యాపేట జిల్లా సింగిరెడ్డిపాలెంలో నివసించే ఆకుల రాజు శరీరంలో కాల్షియం తక్కువగా ఉండడంతో కాళ్లు పడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. సోమవారం సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సోనూసూద్ చారిటీ సభ్యులు, బొల్లారం మున్సిపల్ యువత నాయకులు ప్రవీణ్ రెడ్డి బాధితుడికి 5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.