సంగారెడ్డిలో బిజెపి సంబరాలు

74చూసినవారు
సంగారెడ్డిలో బిజెపి సంబరాలు
కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకులు సంగారెడ్డి పట్టణంలో ఆదివారం రాత్రి సంబరాలు నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి టపాకాయలు కాల్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి, దళిత విభాగం కన్వీనర్ యశ్వంత్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కసినివాసు, కౌన్సిలర్ నాగరాజు, మండల అధ్యక్షుడు పాపయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్