రేపటి నుంచి హనుమాన్ జయంతి వేడుకలు

71చూసినవారు
సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని పురాతన సట్టి హనుమాన్ దేవాలయంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయం అర్చకులు శివశర్మ శనివారం తెలిపారు. 21, 22వ తేదీలలో చండీ హోమం నిర్వహిస్తామని చెప్పారు. 23న ఉదయం 8 గంటలకు 108 లీటర్ల పాలతో హనుమంతునికి అభిషేకం, సాయంత్రం ఐదు గంటలకు సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుందని వివరించారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్