హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలున్నాయి. పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్న చోట వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం లేకుండా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ఆదేశాలిచ్చారు. మద్యం దుకాణాలు మూసేయాలని తెలిపారు.