ఆడియో ఉత్పత్తులు, స్మార్ట్ వాచ్ల తయారీ సంస్థ బోట్ యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. సుమారు 75 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైందని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఇందులో వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, కస్టమర్ ఐడీలు వంటివి ఉన్నాయి. తస్కరించిన డేటాలో సుమారు 2జీబీ డేటాను ఓ ఫోరమ్లో ఉంచినట్లు తెలిపింది. ఈ డేటాను షాపిఫైగై అనే హ్యాకర్ ఏప్రిల్ 5న ఈ డేటాను పోస్ట్ చేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది.