సొంత ముఠా సభ్యుల చేతిలోనే ఓ గ్యాంగ్స్టర్ దారుణ హత్యకు గురైన ఘటన పుణెలో చోటు చేసుకొంది. గ్యాంగ్స్టర్ శరద్ మోహల్(40)కు, అతడి గ్యాంగ్ సభ్యులకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో అతడిపై గ్యాంగ్ సభ్యులు కాల్పులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శరద్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.