కేటీఆర్‌, హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌లు కూల్చాలా వద్దా?: రేవంత్‌రెడ్డి

50చూసినవారు
కేటీఆర్‌, హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌లు కూల్చాలా వద్దా?: రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్ ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'పేదలకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నారు కదా. రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు BRS పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. ఒక రూ.500 కోట్లు మూసీలో ముంపునకు గురైన వారికి పంచిపెట్టండి. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆరోజు సూచనలు ఎందుకు చేయలేదు? కేటీఆర్‌, హరీశ్‌రావు, సబిత కుమారుల ఫామ్‌ హౌస్‌లు కూల్చాలా వద్దా?చెప్పండి. మూసీని అడ్డం పెట్టుకుని ఎంత కాలం బతుకుతారు?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్