చేగుంట బైపాస్ రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

53చూసినవారు
చేగుంట బైపాస్ రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
చేగుంట జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక మృతి చెందారు. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన భూషణం అనే వ్యక్తి జాతీయ రహదారిపై ఉండే మూత్ర శాలల వద్ద పనిచేస్తుంటాడు. రామాయంపేట నుంచి అతివేగంగా వస్తున్న కారు నిలుచున్న అతనిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు రోడ్డుపై పల్టీ కొట్టి పడిపోయింది. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్