ఉద్యోగరీత్యా పదవి విరమణ తప్పదని విద్యుత్ ఏఈ కనకయ్య, శ్రీకాంత్ లు అన్నారు. ఆదివారం దుబ్బాక నియోజకవర్గం డివిజన్ లో పనిచేస్తున్న విద్యుత్ ఏడి రాంబాబు పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంబాబు దుబ్బాక డివిజన్లో ప్రజలకు, రైతులకు విద్యుత్ పరంగా చేసిన సేవలు మరువలేనివని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.