శ్రీరామనవమి పండగని పురస్కరించుకొని తోగుట మండలం కాన్గల్ గ్రామంలో శ్రీరామ కళ్యాణం విజయవంతంగా నిర్వహించగా, తొగుట వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగను ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. శ్రీ రాముని దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.