తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: ఎంపీపీ

74చూసినవారు
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి: ఎంపీపీ
వేసవిలో ప్రజలకు తాగునీటికి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి అన్నారు. ఎంపీపీ అధ్యక్షతన తొగుట మండల సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. బదిలీపై వెళ్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను సన్మానించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ వేల్పుల స్వామి, కోఆప్షన్ కలిముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్