పోచయ్య కుటుంబానికి అండగా ఉంటాం: లక్ష్మీ మోహన్ రావు

79చూసినవారు
పోచయ్య కుటుంబానికి అండగా ఉంటాం: లక్ష్మీ మోహన్ రావు
తొగుట మండలం ఎల్. బంజేరుపల్లి గ్రామానికి చెందిన చాకలి పోచయ్య కుటుంబానికి అండగా ఉంటామని దొమ్మాట ఎంపీటీసీ గన్నమనేని లక్ష్మీ మోహన్ రావు పేర్కొన్నారు. శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన పోచయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యము, రూ. 4 వేల నగదు అందజేశారు. దొమ్మాట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సల్ల స్వామి, మంతూరి రమేష్, మల్లేశం, పడగ రాజు, నాగరాజు, కురుమ బీరయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్