సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం

57చూసినవారు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల పరిధిలోని సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. గత వారం రోజులుగా ఎండిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్