కష్టపడి చదివి పదోతరగతిలో 10 జీపీఏ సాధించాలి

77చూసినవారు
కష్టపడి చదివి పదోతరగతిలో 10 జీపీఏ సాధించాలి
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వసతిగృహం, వంటగది ఆహారపదార్ధాలను పరిశీలించి మాట్లాడుతూ నిల్వనీరు ఉండకుండా చూసుకోవాలని, దోమలు వృద్ధిచెందకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కష్టపడి చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్