వర్గల్ మండలం వేలూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మౌనిక(21) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వేలూరు గ్రామానికి చెందిన మల్లేశం కూతురు మౌనిక టైలరింగ్ చేస్తుంది. గత నెల 27న మౌనికకు పెళ్లి చూపులు నిర్వహించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.