పంట కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించాలి

56చూసినవారు
పంట కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించాలి
హుస్నాబాద్ ప్రాంతంలో వరి ధాన్యం, పత్తి, మొక్క జొన్న పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఐలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో ధాన్యం పత్తి, మొక్క జొన్న పంటల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో మిల్లర్లు, దళారులు రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్