చేర్యాలలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

2247చూసినవారు
చేర్యాలలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
సిద్దిపేట జిల్లాలో, చేర్యాల పట్టణంలో ఒక క్లినిక్ లో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, సిబ్బంది, చేర్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 34, 890, ఐదు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్