ఏఐవైఎఫ్ చేర్యాల మండల సమితి ఆధ్వర్యంలో 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చేర్యాల పట్టణంలోని సంఘం కార్యాలయం ముందు జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు గూడెపు సుదర్శన్ మాట్లాడుతూ 1959 మే 3న ఢిల్లీ కాన్పూర్ లో భగత్ సింగ్, చేగువేర ఆశయం కోసం ఏర్పడిన యువజన సంఘం అఖిల భారత యువజన సమాఖ్య, హక్కుల సాధనకై ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు చేసి హక్కులని సాధించడం జరిగిందన్నారు.