రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందే

1058చూసినవారు
సిద్దిపేట నియోజకవర్గం రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతృత్వంలో నాయకులు రైతు దీక్ష నిరసన కార్యక్రమం శనివారం చేపట్టారు. పలువురు రైతులు నిరసనలో పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఇతర నాయకులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్