బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఇంటిలో జరిగిన రంజాన్ వేడుకలకు హాజరై మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ అమలు చేసిన రిజర్వేషన్లు ఇప్పటికీ అమల్లో ఉన్నాయన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.