కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగడంతో పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని నంగునూర్ మండలం గట్లమల్యాల మాజీ సర్పంచ్ లు తిప్పని రమేశ్, కర్నకంటి రవీంద్రాచారి అన్నారు. గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.