నేటి నుంచి సింగపూర్‌ ఓపెన్‌

82చూసినవారు
నేటి నుంచి సింగపూర్‌ ఓపెన్‌
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత షట్లర్లకు మంచి అవకాశం సింగపూర్ ఓపెన్. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో సింధుతో పాటు ప్రణయ్, లక్ష్యసేన్ ఫేవరెట్లుగా ఉన్నారు. మలేషియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగు తేజం సింధు, ఈ సారి టైటిల్‌పై కన్నేశారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, ప్రియాన్షు, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, డబుల్స్‌లో అశ్విని-తనీషా, గాయత్రి-ట్రీసా కూడా పోటీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్