అనుమానాస్పద స్థితిలో సింగర్ మృతి

62చూసినవారు
అనుమానాస్పద స్థితిలో సింగర్ మృతి
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా శివపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ బిర్హా (జానపద) గాయని ఆంచల్ పటేల్ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మేరకు అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న గాయని సోదరుడు వికాస్ ఆమె భర్తే తన సోదరిని హత్య చేశారని ఆరోపించారు. ఆంచల్ భర్త, మరో మహిళపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆంచల్ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్