నేషనల్ హాకీ ఛాంపియన్ టీం కి ఎంపికైన వాగ్దేవి విద్యార్థి

2599చూసినవారు
నేషనల్ హాకీ ఛాంపియన్ టీం కి ఎంపికైన వాగ్దేవి విద్యార్థి
హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి మనుగొండ వంశీ నేషనల్ హాకీ ఛాంపియన్ టీం కి సెలెక్ట్ అయినట్టు కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశీ ప్రస్తుతం బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడని, ఏప్రిల్ 28 నుండి మే 8 తారీకు వరకు జరిగే 13వ హాకీ ఇండియా జూనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ కి ఎన్నిక కావడం పట్ల కళాశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి వంశీని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, రమేష్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్