వాగ్దేవి ఎన్ఎస్ఎస్ విద్యార్థుల అభినందన

346చూసినవారు
వాగ్దేవి ఎన్ఎస్ఎస్ విద్యార్థుల అభినందన
కేశవపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్య గిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో ఉత్తమ సేవలందించిన శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎస్బీఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు సోమవారం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు కొంగర అనిల్ కుమార్ మరియు ఉమ్మడి జిల్లా బీసీ అధ్యక్షులు ముంజల కుమారస్వామి గౌడ్ వివిధ జిల్లాల వారీగా విచ్చేసి శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ సేవలు ఘననీయమని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో క్రమశిక్షణతో పాటు ఉత్తమ విద్య బోధన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాబడే అరుదైన దేవాలయం అని హుజురాబాద్ పట్టణంలో క్రమశిక్షణతో పాటు ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక అంశాలపై అనేక సేవలందిస్తూ స్థాపించిన సంవత్సరం నుండి ఇప్పటివరకు హుజురాబాద్ డివిజన్ మరియు వివిధ గ్రామాల విద్యార్థులకు ఉత్తమ విద్య బోధన అందిస్తున్న ఏకైక డిగ్రీ కళాశాల వాగ్దేవి డిగ్రీ కళాశాల అని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఏనుగు మైపాల్ రెడ్డి ని అభినందిస్తూ ఇలాగే విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని దీనికి మా అన్నదండలు ఎల్లప్పుడూ ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మేకల నవీన్ కుమార్ అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్