అధ్వానంగా రైతు వేదిక మరుగుదొడ్లు

63చూసినవారు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి రైతు వేదికలో నిర్మించిన మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. గురువారం రైతు వేదికలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. రైతులు మరుగుదొడ్ల వైపు వెళ్లగా అస్తవ్యస్తంగా కనిపించాయి. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. అస్తవ్యస్తంగా ఉన్న మరుగుదొడ్లను వెంటనే సరి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్