తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట ధర్మయ్య భార్య పోశాని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గ్రామంలో పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం పశువులతో గ్రామ శివారు లోకి వెళ్లిన ధర్మయ్య పై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.