తులసిలోని యాంటీమైక్రోబియల్ గుణాలు చర్మ సమస్యలను, చర్మ వ్యాధులను పోగొడతాయి. నాలుగు తులసి ఆకులు, 4 వేప ఆకుల్ని తీసుకుని కాసేపు నీళ్లల్లో నానబెట్టాలి. ఆ నీటికి చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా ఓ వారం రోజులపాటు చేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చెంచా తులసి ఆకుల పేస్ట్ కి పాలల్లో నానబెట్టిన చెంచా ఓట్మీల్, చెంచా తేనె, 2 చెంచాల బ్రౌన్ షుగర్ కలిపి ముఖానికి రుద్దుకోవాలి. ఇలా 10 ని. చేస్తే మృతకణాలు తగ్గి, మొటిమలు, మచ్చలు పోతాయి.