జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గులాం అహ్మద్ వానీ, తాజ్ బేగంలపై వారి కుమారుడు మహ్మద్ అష్రఫ్ వానీ దాడి చేశాడు. బైక్పై వెళ్తూ మహ్మద్ అష్రఫ్ తన పేరెంట్స్ను చూసి ఆగాడు. వెంటనే తన చెప్పు తీసి వృద్ధులు అనే కనికరం లేకుండా వారిని కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తల్లి ఫిర్యాదుతో మహ్మద్ అష్రఫ్ వానీపై నౌగామ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.