ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. SRH ఆల్ రౌండర్ కమిందు మెండిస్ కేవలం ఒక్క పరుగుకే ఔట్ అయ్యారు. 17వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి బంతికి సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి మెండిస్ పెవిలియన్ చేరారు. దీంతో 17వ ఓవర్ ముగిసేసరికి SRH స్కోర్ 120/6గా ఉంది. క్రీజులో అనికేత్ వర్మ(14), ప్యాట్ కమిన్స్ (0) ఉన్నారు.