ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ 27 పరుగులకు ఔట్ అయ్యారు. 14వ ఓవర్లో సాయి కిషోర్ వేసిన ఐదో బంతికి క్లాసెన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో 14వ ఓవర్ ముగిసేసరికి SRH స్కోర్ 101/4గా ఉంది. క్రీజులో నితీష్(28), అనికేత్ వర్మ (1) ఉన్నారు.