TG: రాష్ట్రంలో ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆరోగ్య శాఖా మంత్రి రాజనర్సింహా అన్నారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీ నిర్వాహకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని.. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ప్రతి 6 నెలలకు వర్క్షాప్లు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.