ఒడిశా అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత, రణ్పూర్ ఎమ్మెల్యే సురామ సాధి ఎన్నికయ్యారు. గురువారం ఆమెను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమెకు సీఎం మోహన్ చరణ్ మాఝీ, మాజీ సీఎం నవీన్ పట్నాయక్, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఆమె రణ్పూర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా సేవలందించారు. ప్రమీలా మల్లిక్ తర్వాత ఒడిశా శాసనసభలో స్పీకర్ పదవిని చేపట్టిన రెండవ మహిళగా ఆమె నిలిచారు.