ఆలేరు పట్టణంలో దొంగల హాల్ చల్.. మూడు ఇండ్లలో చోరీ

2999చూసినవారు
ఆలేరు పట్టణంలోని రామ్ శివాజీ నగర్, శాంతి నగర్ కాలనీలలో దొంగలు శుక్రవారం రాత్రి మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. పట్టణం లోని కౌడ చంద్రయ్య ఇంట్లో తులం నర బంగారం, 60 తులాల వెండి, అబ్బా సాయిలు ఇంట్లో సుమారు లక్ష రూపాయల నగదు, సంతోష్ ఇంట్లో 35 వేల నగదు దొంగిలించారు. పట్టణంలో ఒకేసారి మూడు ఇండ్లలో దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్