ప్రారంభమైన ఇంటింటి సర్వే

61చూసినవారు
ప్రారంభమైన ఇంటింటి సర్వే
దేవరకొండ పురపాలకలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 20వ వార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే గురువారం ప్రారంభమైంది. ఐదు రోజులపాటు నిర్వహించే సర్వేలో, ప్రతి రోజు 30 ఇళ్లలో సర్వే నిర్వహించి సర్వే పూర్తయిన తర్వాత ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్లు ఆర్డీఓ శ్రీరాములు తెలిపారు. ఈ సర్వేలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజు, తహసీల్దార్ సంతోష్ కుమార్, మునిసిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్