బిజెపి ప్రచార రథం ఫ్లెక్సీలు చించివేత

15155చూసినవారు
నేరేడుచర్ల మండలం దాసారం గ్రామంలో పార్లమెంట్ బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచార రథం ఫ్లెక్సీలను దుండగులు చించి వేశారు. ప్రచార రథం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఫ్లెక్సీలను చించేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బిజెపి శ్రేణులు హెచ్చరించారు. దేశంలో అవినీతి రహిత పాలన కేవలం ప్రధాని నరేంద్ర మోడీ తోనే సాధ్యమని ఆదివారం బీజేపీ శ్రేణులు అన్నారు.

సంబంధిత పోస్ట్