అవినీతి బిఆర్ఎస్, మతతత్వ బిజెపిని ఓడించండి

1566చూసినవారు
అవినీతి బిఆర్ఎస్, మతతత్వ బిజెపిని ఓడించండి
పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపిని ఓడించాలని సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం నేరేడుచర్లలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ ప్రత్యేక ఎజెండా రూపొందించి ఆర్ఎస్ఎస్ భావాలను ప్రజల్లో నింపాలని, మతాన్ని, కులాన్ని పెంచి పోషిస్తూ దేశంలో విద్వేషాన్ని సృష్టించడంలో ముందున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్