తండ్రి ప్రాణం తీయాలనుకుంటే.. పెద నాన్న ప్రాణం పోశాడు

85చూసినవారు
తండ్రి ప్రాణం తీయాలనుకుంటే.. పెద నాన్న ప్రాణం పోశాడు
కన్నతండ్రి ప్రాణం తీయాలనుకుంటే.. పెద నాన్న ప్రాణం పోశాడు.నాంపల్లి మండలం రాందాస్‌ తండాకు చెందిన మెఘావత్‌ మధు నాలుగేళ్ల క్రితం భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి, ఆరేళ్ల కూతురు ఇందుమతిపైనా దాడి చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత చిన్నారి సంరక్షణ బాధ్యత పెదనాన్న తీసుకున్నాడు. అయితే 20రోజుల క్రితం చిన్నారికి జ్వరం రావడంతో గుండెకు 2రంధ్రాలు ఉన్నట్లు గుర్తించి బుధవారం నిమ్స్‌లో ఇందుమతికి ఉచితంగా గుండె చికిత్స చేయించారు.

సంబంధిత పోస్ట్