సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో మంగళవారం గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఓ నెగటివ్ రక్తం కావలసి ఉండగా, ఎస్ఎన్ ఫౌండేషన్ ను సంప్రదించారు. తక్షణమే స్పందించి ఫౌండేషన్ సభ్యుడు రాచకొండ మహేష్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాచకొండ మహేష్ ను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.