నేడు పరమశివునికి ఘనంగా అమావాస్య పూజలు

566చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు అమావాస్య సోమవారం మహా పర్వదిన సందర్భంగా బ్రహ్మసూత్రం ఉన్న శ్రీ మహాదేవ నామేశ్వర స్వామికి విశేషంగా పంచామృతాలతో రుద్రాభిషేకం, ఘనంగా ధూప సేవలు, నక్షత్ర హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు పరమశివుడు దివ్యదర్శనంలో దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్