పంచాయతీ రాజ్ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఆర్ఈఈలకు శుక్రవారం పదోన్నతులు కల్పించింది. పంచాయత్ రాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్లుగా ప్రమోషన్ కల్పిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 16 మంది ఈఈలను, ఎస్ఈలుగా పదోన్నతి కల్పించినట్టు ఉత్తుర్వులో పేర్కొంది. అలాగే, వారికి జిల్లాలలో పోస్టింగ్ను సైతం కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసింది.