తెలంగాణలో జొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. ఆదిలాబాద్, నిజామాబాద్ రైతుల విజ్ఞప్తి మేరకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. జొన్న రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.