TG: నల్గొండ జిల్లా నకిరేకల్లో పోలీస్ స్టేషన్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని నకిరేకల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేటీఆర్పై FIR నమోదు చేశారు. కాగా లీకేజీ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.