పదో ప్రయత్నంలో టెన్త్ క్లాస్ పాస్!

82చూసినవారు
పదో ప్రయత్నంలో టెన్త్ క్లాస్ పాస్!
మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన కృష్ణ నాందేవ్ ముండేను అభినవ విక్రమార్కుడిగా నెటిజన్లు కీర్తిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. అతను పదో తరగతి పాసయ్యేందుకు అవిశ్రాంత పోరాటమే చేశాడు. 2018 నుంచి 2024 వరకు వరుసగా పదిసార్లు టెన్త్ క్లాస్ పరీక్షలు రాశాడు. చివరికి ఈ ఏడాది పదో ప్రయత్నంలో అతను పది పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండుమేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.

సంబంధిత పోస్ట్