లోక్ సభ ఎన్నికలు-2024లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ మొదలైంది. మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ లో కొత్తగా పెళ్లయిన వధువు దీప్తి శర్మ 2024 లోక్సభ ఎన్నికల రెండో దశలో ఓటు వేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో అవుతోంది.