సైబర్ క్రైమ్ విభాగం 2 కీలకమైన కేసులు చేధించిందని HYD సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డఫాబెట్ వెబ్సైట్ లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. HYDకు చెందిన వ్యక్తి డఫాబెట్లో రూ.70 లక్షలు పెట్టి ఆన్లైన్ గేమ్లు ఆడి మోసపోయి ఫిర్యాదు చేశారని తెలిపారు. హరియాణాకు చెందిన నిందితుడు హితేశ్ గోయల్ ను అరెస్ట్ చేసి.. రూ.1.40 కోట్ల నగదు సీజ్ చేశామని చెప్పారు.