ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. ఆస్తి కోసం కన్న కొడుకుని ఓ తండ్రి హత్య చేయించిన ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోటపాడులో ఈ ఘటన జరిగింది. తన భర్త రామాంజనేయులు కనిపించట్లేదని ఈ నెల 23న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామాంజనేయులు మిస్సింగ్పై పోలీసులు చేసిన విచారణలో నిజం బయటపడింది.