తెలంగాణ నూతన హైకోర్టు భవనానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. సాయంత్రం 5.30 గంటలకు హైకోర్టు భవనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్ బుద్వేల్లో 100 ఎకరాల్లో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీజేఐతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే,ఇతర న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.